గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Mar 16 , 2024 | 12:13 AM
మండలంలోని గర్రెపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా గ్రంథాలయాన్ని విద్యార్థులు నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకో వాలని కాంపిటీటివ్ పరీక్షలలో రాణించాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచిం చారు.
సుల్తానాబాద్, మార్చి 15: మండలంలోని గర్రెపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా గ్రంథాలయాన్ని విద్యార్థులు నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకో వాలని కాంపిటీటివ్ పరీక్షలలో రాణించాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచిం చారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లిలో పాత గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన ప్రజా గ్రంథాలయాన్ని (పబ్లిక్ రీడింగ్ రూమ్)ను శుక్రవారం అరుణశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఈ గ్రంథాయలంలో విద్యార్థులకు,నిరుద్యోగ యువతకు అవసరమున్న పుస్తకాలను, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నోటిఫికెషన్లకు సంబందించి పరీక్షలను రాసేందుకు అందుబా టులో అవసరమైన పుస్తకాలలను ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, ఎంపీటీసీ పులి అనూష, ఎంపీడీఓ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ దివ్యదర్శన్రావు, ఎంపీవో ఫయాజ్అలీ, సెక్రటరీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 16 , 2024 | 12:13 AM