విద్యుత్ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం
ABN, Publish Date - Jun 04 , 2024 | 11:42 PM
విద్యుత్ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని తెలంగాణ యునై టెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు అన్నారు.
పెద్దపల్లి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని తెలంగాణ యునై టెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు అన్నారు. మంగళవారం తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రి సిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటి యు) పెద్దపల్లి జిల్లా విస్తృత సమావేశం స్థానిక మూన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈ, ఈశ్వరరావు పాల్గొ న్నారు, ఆయన మాట్లాడుతూ విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ ఆన్ మ్యాన్డ్ మీటర్ రీడర్స్ బిల్ కలెక్టర్స్, ఎస్పీఎంస్, జేఎల్ఎమ్స్, తదితర కేటగిరిలో పనిచేస్తున్న కార్మికుల, ఉద్యోగుల సమస్య ల పరిష్కారం కోసం సీఐటీయూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని, ఈ పోరాటా లకు ఆకర్షితులై జిల్లాలోని 45మంది కార్మి కులు యూనియన్లో చేరడాన్ని ఆహ్వాని స్తున్నామన్నారు. సీఐటీయూపై నమ్మకం తో చేరిన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో సిఐటీయూ చిత్త శుద్ధితో కార్మికులందరినీ సమీకరించి ఉద్య మిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలవాల స్వామి, సీఐటీయూ జిల్లా కార్య దర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఆంజనేయులు, పెద్దప ల్లి జిల్లా యూనియన్ అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు బి, వాగు నాయక్, సిహెచ్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2024 | 11:42 PM