కదిలిన యంత్రాంగం
ABN, Publish Date - Oct 23 , 2024 | 11:16 PM
అలంపూర్ చౌరస్తా సమీ పంలోని వెంచర్లకు అక్రమంగా తరలి స్తున్న మట్టిరవాణపై కలెక్టర్ స్పందించా రు.
మట్టి దందాపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
అలంపూర్ చౌరస్తా, అక్టోబరు 23, (ఆంధ్రజ్యోతి): అలంపూర్ చౌరస్తా సమీ పంలోని వెంచర్లకు అక్రమంగా తరలి స్తున్న మట్టిరవాణపై కలెక్టర్ స్పందించా రు. ఈ విషయంపై ‘మట్టి దందా ఏపీ టు తెలంగాణ’ అనే కథనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ నెల 20న ప్రచురితమైంది. ఇందుకు కలెక్టర్ సంతోష్ స్పందించారు. విచారణ చేయాల్సిందిగా మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో బుధ వారం మైనింగ్శాఖ సీనియర్ ఆసిస్టెంట్ సత్యనారా యణ, ఉండవల్లి ఆర్ఐ వాణిలతో కలిసి సదరు వెంచర్ను పరిశీలించారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని ఉండవల్లి తహసీల్దారు హరికృష్ణ తెలిపారు.
Updated Date - Oct 23 , 2024 | 11:16 PM