ట్రాక్టర్ను ఢీకొన్న కారు: బాలుడి మృతి
ABN, Publish Date - May 27 , 2024 | 11:43 PM
ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఓ బాలు డు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఉప్పునుంతల, మే 27 : ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఓ బాలు డు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమ వారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని శ్రీశెలం- హైదరాబాద్ జాతీయ రహదారిలోని అయ్యవారిపల్లి స్టేజి సమీపంలో చోటు చేసుకొంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాలోని జ డ్చర్ల పట్టణానికి చెందిన ఐదుగురితో కూడిన వ్యక్తులు కారులో దైవదర్శనం కోసం శ్రీశెలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉప్పునుంతల మండల పరిధిలోని అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలో ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఓవర్ స్పీడు గా ఢీకొన్నది. దీంతో ముందు కూర్చున్న కేతావత్ చైతన్య(16) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా స్థానిక పోలీసులు అ చ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి ఎలాంటి ప్రమా దం జరగలేదని ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - May 27 , 2024 | 11:43 PM