పనులు త్వరితగతిన పూర్తి కావాలి
ABN, Publish Date - May 24 , 2024 | 11:05 PM
అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు.
- అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
- బల్దియాలో పన్నుల వసూలు వేగవంతం చేయాలని సూచన
కోస్గిరూరల్, మే 24 : అమ్మ ఆదర్శ పాఠశా లలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, బీసీ కా లనీ ప్రాథమిక పాఠశాలలను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో తక్షణం చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో సిబ్బం దితో సమావేశం అయ్యారు. పన్నుల వసూలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అనంతరం బల్ది యా పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఓ వెంచర్ను పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ శశిధర్, ఆయా శాఖల ఏఈలు, సిబ్బంది తదితరులున్నారు.
Updated Date - May 24 , 2024 | 11:05 PM