ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andole:అందోల్‌లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు!

ABN, Publish Date - Mar 10 , 2024 | 03:42 AM

సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని రంగనాయకసాగర్‌ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్‌ ఈమని నాగిరెడ్డి తెలిపారు.

  • అవి 9-11 శతాబ్దాల మధ్య నాటివి: ఈమని నాగిరెడ్డి

జోగిపేట, మార్చి 9: సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని రంగనాయకసాగర్‌ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్‌ ఈమని నాగిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఈ శిల్పాలను పరిశీలించారు. అందోల్‌లోని శ్రీరంగనాథాలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు.. రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యుల హయాం క్రీస్తుశకం 9-11 శతాబ్దాల మధ్య చెక్కినవని వెల్లడించారు.

అలాగే చెరువుగట్టున నాగులకట్టపై వెలిసిన చెన్నకేశవ, జనార్దన, నాగదేవతల విగ్రహాలు.. కల్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలం 11-13 శతాబ్దాల మధ్యవని వివరించారు. చెన్నకేశ విగ్రహం చుట్టూ ఉన్న మకర తోరణం, శ్రీదేవి, భూదేవి దశావతార శిల్పాలకు చారిత్రక ప్రాధాన్యముందన్నారు. ఈ శిల్పాలు అలనాటి అద్భుత శిల్ప కళానైపుణ్యానికి అద్దం పడుతున్నాయని చెప్పారు. నాగులకట్టగా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేయవచ్చని చరిత్రకారులు అంటున్నారు.


కనుమరుగవుతున్న చరిత్ర..

ఉమ్మడి మెదక్ జిల్లాలో అందోల్‌కి ప్రత్యేక చరిత్ర ఉంది. అందోల్‌ కేంద్రంగా రాణి శంకరమ్మ పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఆమె పాలనలో అందోల్ సంస్థానాన్ని శత్రువుల నుంచి కాపాడేందుకు శత్రుదుర్భేద్యమైన కోట బురుజులు నిర్మించారు. ప్రస్తుతం వాటిల్లో దాదాపు అన్ని కనుమరుగయ్యాయి. అందోల్ చరిత్ర ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుడు ఈ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా పాలించాడు. దేశాయిని తన సామంతరాజుగా నియమించుకుని ఈ కోటలను వారి కాలంలో నిర్మించారు. అప్పటి రాజుల పాలనకు ఇవి చారిత్రక ఆనవాలుగా నిలుస్తున్నాయి.


అందోల్ లోపలికి రావడానికి 3 ప్రాంతాల నుంచి మూడు గౌనీలు ఉన్నాయి. శంకరమ్మ పరిపాలిస్తున్న కాలంలో రాత్రి 7 గంటలు దాడితే గ్రామంలోనికి వీటి నుంచి ప్రవేశం ఉండేదికాదు. అత్యవసమైతే పక్కనే ఉన్న చిన్న గేటు ద్వారా లోనికి అనుమతించే వారు.

అంత పటిష్ట బందోబస్తు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇవి ప్రభుత్వ భూములు కావడంతో ఆక్రమణకు గురవుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చరిత్ర గుర్తులను కాపాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చరిత్ర గుర్తులను పదిలం చేస్తే రాబోయో తరాలకు దిక్చూచిగా అందోల్ నిలుస్తుంది

Updated Date - May 25 , 2024 | 04:36 PM

Advertising
Advertising