స్వాతంత్య్ర సమరయోధుడు మట్టారెడ్డి మృతి
ABN, Publish Date - Jul 27 , 2024 | 12:53 AM
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బైరెడ్డి మట్టారెడ్డి(105) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెం దారు.
పెనపహాడ్, జూలై 26: సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బైరెడ్డి మట్టారెడ్డి(105) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెం దారు. ఆయనకు భార్య అచ్చమ్మతో పాటు ఐదుగురు కుమారులు వెంకటనారాయణ, మధుసూదనరెడ్డి, కేశవరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివా్సరెడ్డి, ఇద్దరు కుమార్తె కళమ్మ, అనంతమ్మ ఉన్నారు. కుమారుడు శ్రీనివా్సరెడ్డి సర్పంచగా పనిచేశారు. మరో కుమారుడు వెంకటనారాయణ గతంలోనే మృతిచెందాడు. మట్టారెడ్డి మృతదేహంపై పూలమాలలు వేసి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన తూముల భుజంగరావు, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, పీఏసీఎస్ చైర్మన్లు నాతాల జానకిరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మామిడి రేవతిపరంధాములు, ఎత్తిపోతల పథకం మాజీ చైర్మన ధనియాకుల సత్యనారాయణ, మాజీ సర్పంచలు బైరెడ్డి శ్రీనివా్సరెడ్డి, చెన్ను శ్రీనివా్సరెడ్డి, దంతాల వెంకటేశ్వర్లు, మామిడి శ్రీనివాస్, గజ్జెల సైదిరెడ్డి, సతీష్ నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2024 | 08:56 AM