ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సమస్యలకు నెలవుగా జిల్లా ఆసుపత్రి

ABN, Publish Date - May 21 , 2024 | 11:57 PM

జిల్లా ఆసుపత్రి సమస్యలకు నెలవుగామారి రోగులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు.

జిల్లా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

భువనగిరి టౌన, మే 21: జిల్లా ఆసుపత్రి సమస్యలకు నెలవుగామారి రోగులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు. మంగళవారం సీపీఎం నాయకులు జిల్లా ఆసుపత్రికి సందర్శించి పేరుకుపోయిన సమస్యలను పరిశీలించారు. రోగులు, సహాయకులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా ప్రైవేట్‌ లేదా హైదరబాద్‌ ఆసుపత్రులకు వెళ్లాలని రోగులకు వైద్యులు సూచిస్తుండడం.. జిల్లా ఆసుపత్రి ఇంకా రెఫరల్‌ ఆసుపత్రిగానే కొనసాగుతుండటం దారుణమన్నారు. పూర్తిస్థాయి వసతులు కల్పించి అన్ని వైద్య సేవలు అందించాలని, ఖాళీలను భర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో రాజకీయ పార్టీలకు ప్రాతినిఽథ్యం కల్పించాలన్నారు. మాతాశిశు ఆసుపత్రిని ప్రత్యేకంగా నిర్మించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నాయకులు దాసరి పాండు, మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్‌, ముత్యాలు, శివ, అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:09 AM

Advertising
Advertising