కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
ABN, Publish Date - Jul 26 , 2024 | 12:19 AM
మండల పరిధిలో కారు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. స్థానిక సీఐ. రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
యాదగిరిగుట్ట రూరల్, 25: మండల పరిధిలో కారు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. స్థానిక సీఐ. రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు కార్మికులు కాశిరాం, బకిల్ ద్విచక్రవాహనంపై స్థానిక సన్నిధి హోటల్ వద్ద మళ్లు తుండగా గుట్ట నుంచి రాయగిరి వైపు వెళుతున్న కారు డ్రైవర్ అతివేగంగా వస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనంపై ఉన్న కాశీరాం, బకిల్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల స్నేహితుడు రాసాల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Updated Date - Jul 26 , 2024 | 09:04 AM