ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు
ABN, Publish Date - Sep 12 , 2024 | 11:37 PM
ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు గాయాల పాలైన ఘటన బుధవారం కీసర పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కీసర రూరల్, సెప్టెంబరు 12: ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు గాయాల పాలైన ఘటన బుధవారం కీసర పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర మండలం రాంపల్లి దాయరకు చెందిన దూసరిసాకేత్, ఇంద్రసేనారెడ్డిలు వారి ఎర్టిగా కారులో కీసర నుంచి కుషాయిగూడ దిశగా ప్రయాణిస్తున్నారు. కాగా ఆవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో వర్దనా స్కూల్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వీరిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Sep 13 , 2024 | 07:54 AM