గేట్ దిమ్మె కూలిపడి చిన్నారి దుర్మరణం
ABN, Publish Date - May 21 , 2024 | 12:25 AM
తోటి పిల్లలతో ఆడుకుంటూ బాలిక గేట్ దిమ్మెను పట్టుకోగా అది కూలిపడి బా లిక మృతిచెందిన విషాదకర ఘటన ఫరూఖ్నగర్ మండలం మధురాపూర్ లో సోమవారం చోటుచేసుకుంది.
షాద్నగర్ రూరల్, మే 20 : తోటి పిల్లలతో ఆడుకుంటూ బాలిక గేట్ దిమ్మెను పట్టుకోగా అది కూలిపడి బా లిక మృతిచెందిన విషాదకర ఘటన ఫరూఖ్నగర్ మండలం మధురాపూర్ లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మల్లే్ష-రమాదేవి దంపతుల కూతురు సాక్షి(4) ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న ప్రహరీగోడ గేటు దిమ్మెను పట్టుకుంది. దిమ్మెను బలహీనంగా కట్టడం తో ముట్టుకోగానే బాలిక తలపై పడిం ది. సాక్షి తలపై పెళ్లలు పడి తల పగిలి అక్కడికక్కడే మృతిచెందింది. కళ్ల ముందే కూతురి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Updated Date - May 21 , 2024 | 08:43 AM