కొడుకును చూసేందుకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం
ABN, Publish Date - May 25 , 2024 | 11:36 PM
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడిని చూసేందుకు వెళ్లిన తండ్రి అదృశ్యమయ్యాడు.
షాబాద్, మే 25: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడిని చూసేందుకు వెళ్లిన తండ్రి అదృశ్యమయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. షాబాద్ మండలం నాగర్కుంటకు చెందిన పానుగంటి నర్సింలు(60) కుమారుడు మల్లేశ్ నగరంలోని ఉస్మానియా ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 14న కొ డుకును చూసేందుకు నర్సింలు ఉస్మానియా ఆస్ప త్రికని ఇంటి నుంచి బయల్దేరి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం ఆసుపత్రి పరిసరాల్లో, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యంకాలేదు. నర్సింలు తప్పిపోయినప్పుడు ధోతి, తెల్లని షర్టు ధరించి ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8297522514 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Updated Date - May 25 , 2024 | 11:36 PM