రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
ABN, Publish Date - Mar 18 , 2024 | 12:20 AM
తోటి ఉద్యోగి పెళ్లికి కారులో వెళ్లివస్తుండగా కారు అదుపుతప్పి ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందాడు.
తోటి ఉద్యోగి పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన
వికారాబాద్, మార్చి 17: తోటి ఉద్యోగి పెళ్లికి కారులో వెళ్లివస్తుండగా కారు అదుపుతప్పి ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్ మండలం పులుపుమామిడి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కెపల్లి శివారులో కానిస్టేబుల్ పెళ్లికి వికారాబాద్ నుంచి మిత్రులు ఏఆర్ కానిస్టేబుళ్లు అగ్గనూర్ కృష్ణకుమార్ (34), దిలీ్పకుమార్, రాజు, నరేందర్లు కలిసి కారులో వెళ్లారు. తిరిగివస్తూ మార్గమధ్యన పులుసుమామిడి సమీపంలోని వంతెన వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి వంతెనను ఢికొంది. ఈ ప్రమాదంలో కృష్ణకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్నన మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడికి బషీరాబాద్ మండలం అల్లాపూర్ గ్రామం కాగా 2018లో ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. మృతుడికి భార్య నర్సమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, నాలుగేళ్ల కొడుకు, రెండున్నరేళ్ల కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా కృష్ణకుమార్ భౌతికకాయాన్ని సందర్శించిన ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి..
పూడూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పరిగి మండలంలోని సైదపల్లి గ్రామానికి చెందిన చాకలి మొగులయ్య(40) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొగులయ్య భార్య అనిత అనారోగ్యంతో బాధపడుతూ సిరిగాయిపల్లిలోని పుట్టింట్లో ఉంది. శనివారం మొగులయ్య భార్యను చూసేందుకు బైక్పై సరిగాయిపల్లి వెళ్లాడు. రాత్రి తిరిగి వెళ్తున్న క్రమంలో పూడూరు మండలం సోమన్గుర్తి గ్రామశివారులోకి రాగానే గుర్తుతెలియని వాహనం మొగులయ్య బైక్ను ఢీ కొట్టింది. దీంతో మొగులయ్య తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు చాకలి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Mar 18 , 2024 | 12:20 AM