ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయాలు

ABN, Publish Date - May 03 , 2024 | 12:03 AM

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు తీవ్ర గాయలయ్యాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఎన్నికల సమావేశం అనంతరం భోజనాలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ధారూరు, మే 2: చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు తీవ్ర గాయలయ్యాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఎన్నికల సమావేశం అనంతరం భోజనాలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం సమావేశానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి భోజనాలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చికెన్‌ కర్రీ వేసుకునేందుకు వెళ్లిన మండల పరిధిలోని కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త గొర్రెంకల మల్లయ్య కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్‌ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన కార్యకర్తలు ఆయనను వెంటనే వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 12:03 AM

Advertising
Advertising