హిమాయత్ సాగర్లో మృతదేహం లభ్యం
ABN, Publish Date - Jul 04 , 2024 | 12:15 AM
శంషాబాద్ మున్సిపాలిటీలోని కోత్వాల్గూడబస్తీ శివారులోని హిమాయత్సాగర్లో బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.
శంషాబాద్, జూల్ 3 : శంషాబాద్ మున్సిపాలిటీలోని కోత్వాల్గూడబస్తీ శివారులోని హిమాయత్సాగర్లో బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు. చెరువులో తేలియాడుతున్న శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెల్లి పరిశీలించి పంచనామా చేసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు చామన చాయ రంగు కలిగి.. 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటాడని పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిస్తే శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందంచాలని తెలిపారు.
Updated Date - Jul 04 , 2024 | 07:32 AM