పంట పొలంలో జింక ప్రత్యక్షం
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:50 PM
మండల పరిధిలోని మీర్జగూడ గ్రామంలో శుక్రవారం జింక ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఆవుల జంగయ్య పొలం పనులు చేస్తుండగా జింక పొలంలోకి వచ్చింది
వికారాబాద్ అటవీ అధికారులకు అప్పగింత
చేవెళ్ల, జూలై 26 : మండల పరిధిలోని మీర్జగూడ గ్రామంలో శుక్రవారం జింక ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఆవుల జంగయ్య పొలం పనులు చేస్తుండగా జింక పొలంలోకి వచ్చింది. పక్కనే ఉన్న పశువుల పాకలోకి వెళ్లడంతో ఆయన వెంటనే పోలీ్సలకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీ్సలు అక్కడికి చేరుకుని వికారాబాద్ అటవీ ప్రాంతం నుంచి జింక తప్పిపోయి వచ్చినట్లు భావించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, వీధికుక్కలు జింకను వెంబడించడంతో జింకకు గాయాలయ్యాయి. పోలీసులు వైద్యం చేయించి వికారాబాద్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Updated Date - Jul 26 , 2024 | 11:50 PM