రాకంచర్లలో కబడ్డీ పోటీలు
ABN, Publish Date - May 19 , 2024 | 11:45 PM
మండలంలోని రాకంచర్లలో శ్రీలక్ష్మీ నర సింహస్వామి జాతర సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు.
పూడూరు, మే 19: మండలంలోని రాకంచర్లలో శ్రీలక్ష్మీ నర సింహస్వామి జాతర సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఆర్గనైజర్లు చంటి, నగేష్, శివా, హరి, రాహుల్, గణేష్, శ్రీశైలం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఆరు జట్లు పోటీపడ్డాయి. చివరి రోజు ఆదివారం గెలుపొందిన జట్టుకు మొదటిబహుమతి కంకల్ జట్టుకు మొదటి బహుమతి రూ.10వేలు, తిమ్మాపూర్ జట్టుకు రెండో బహుమతి రూ.5వేలు అందజేశారు. బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు ప్రైజ్మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2024 | 11:45 PM