ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నీటిలో మునిగి వ్యక్తి మృతి

ABN, Publish Date - May 16 , 2024 | 12:40 AM

చేపల వల తెచ్చేందుకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతిచెందాడు.

తాండూరు రూరల్‌, మే 15: చేపల వల తెచ్చేందుకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన తాండూరు మండల పరిధిలోని రాం పూర్‌లో చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలాఉన్నాయి. రాంపూర్‌కు చెందిన డప్పు రాజునాయక్‌(45) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో చేపలు పట్టి అక్కడే వదిలేసిన వలను తెచ్చేందుకు గ్రామంలోని నీటి కుంట వద్దకు వెళుతున్నట్లు భార్య సావిత్రిబాయికి చెప్పి వెళ్లాడు.ఉదయం 9గంటలకు రాజు తమ్ముడు రమేష్‌ సావిత్రిబాయికి ఫోన్‌ చేసి అన్న రాజు నీటికుంటలో దిగి నీట మునిగి మృతిచెందాడని సమాచారం అందించాడు. రాజునాయక్‌ భార్య సావిత్రిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 09:04 AM

Advertising
Advertising