చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN, Publish Date - Oct 23 , 2024 | 12:08 AM
రెండు నెలలక్రితం ఎదు రెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.
యాచారం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రెండు నెలలక్రితం ఎదు రెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. చిన్నతూండ్ల, పెద్దతూండ్ల గ్రామాల మధ్య రెండు నెలల క్రితం రెండు బైక్లు ఎదురెదు రుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో చిన్నతూండ్లకు చెందిన రాఘవేందర్(35) తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబికులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాఘవేందర్ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Oct 23 , 2024 | 06:49 AM