ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి
ABN, Publish Date - Oct 23 , 2024 | 11:46 PM
చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం చేవెళ్లలో హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఎస్ఎ్ఫఐ నాయకులు, విద్యార్థులు ధర్నా చేశారు.
చేవెళ్ల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం చేవెళ్లలో హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఎస్ఎ్ఫఐ నాయకులు, విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎ్ఫఐ డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు చేవెళ్లకు రావడానికి సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కళాశాలలు, పాఠశాలల సమయానికి అనుకూలంగా బస్సులు నడిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చరణ్గౌడ్, సమీర్, చందు, నవీన్, గణేశ్, సాయి, తేజ ఉన్నారు.
Updated Date - Oct 23 , 2024 | 11:46 PM