ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యాదగిరికొండపై హరిహరులకు పూజలు

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:43 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి కొండపై సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి.

కొండపై శివాలయంలో ఊరేగింపు సేవ నిర్వహిస్తున్న అర్చకులు

భువనగిరి అర్బన్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి కొండపై సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామిఅమ్మవారికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామివారికి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకస్వాములు మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు విశ్వక్సేనుడికి తొలి పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార వెండి జోడు సేవలు, సహాస్రనామార్చనలు ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయంలోని ముఖమండపంలో స్ఫటికమూర్తును అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. శివపార్వతుల ఉత్సమూర్తులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. ఆలయన ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.14,21,247 ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు. కాగా, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దంపతులు, కూతురు రీల్స్‌ చిత్రీకరించినట్లు ఎక్స్‌లో ఆయన పోస్టు చేయగా వివాదమైన సంగతి తెలిసిందే. స్వామివారి ప్రతిష్టకు భంగం, భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు ఆటంకం కలిగించే ఏ క్రియనైనా అనుమతించబోమని ఈవో సోమవారం ప్రకటించారు. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు జ్ఞాపకార్థం ఆలయం వెలుపల ఫొటోలకు మాత్రమే అనుమతి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇకముందు ఆలయ ప్రాశస్త్యం, భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక శోభను దృష్టిలో ఉంచుకొని ఇకపై వీడియో, ఫొటోల చిత్రీకరణపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 12:43 AM