ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ వరద బాధితులకు పరిహారం అందజేత

ABN, Publish Date - Sep 25 , 2024 | 08:42 AM

భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బుడమేరు వరదలకు విజయవాడలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది.

అమరావతి: విజయవాడలో వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం బుధవారం నుంచి నష్టపరిహారం అందించనుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహారం సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయనుంది. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా వరద బాధితులకు పలువురు దాతలు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.


భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బుడమేరు వరదలకు విజయవాడలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ఒక్క విజయవాడ పరిధిలోనే ముంపు బారిన పడిన బాధితులు సుమారు లక్షన్నర మంది ఉన్నారు. బాధితులకు ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను ప్రభుత్వం పంపిణి చేయనుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహానాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజమండ్రిలో చిరుత సంచారం కలకలం..

భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 08:42 AM