ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బండి సంజయ్ సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Sep 22 , 2024 | 12:45 PM

తిరుమల లడ్డూపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిగా సహకరిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తుకు కూడా కేంద్రం సిద్దమేనని, హిందూ దేవాలయాల్లో హిందువులనే నియమించాలని అన్నారు.

కరీంనగర్: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని, లడ్డూ అపవిత్రతకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని, పవిత్ర లడ్డూను వ్యాపార కోణంలో చూశారని మండిపడ్డారు.


లడ్డూపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిగా సహకరిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తుకు కూడా కేంద్రం సిద్దమేనని, హిందూ దేవాలయాల్లో హిందువులనే నియమించాలని అన్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై కేంద్రం జ్యోక్యం చేసుకుంటుందన్నారు. లడ్డూ అపవిత్రం అంటే హిందువులపై దాడేనని.. పథకం ప్రకారమే లడ్డూ పవిత్రతను దెబ్బ తీశారని బండి సంజయ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టైం ఇచ్చి కూల్చండి.. బాధితుడి ఎమోషనల్..

సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో

జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. చర్చకు సిద్ధమా..

జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 12:45 PM