ఆర్. కృష్ణయ్యకు బీజేపీ బంపర్ ఆఫర్..
ABN, Publish Date - Sep 23 , 2024 | 11:09 AM
బీసీ సీఎం నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకులను గణనీయంగా పెంచుకునే దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది.
హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారా.. కాషాయ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. బీసీ సీఎం నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకులను గణనీయంగా పెంచుకునే దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది.
ఈ మేరకు కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. తమ ఆఫర్కు ఆయన సానుకూలంగా స్పందించారని.. పార్టీలో కీలకపదవి కట్టబెట్టపోతున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసిన కృష్ణయ్యకు ఆ సంస్థ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాదాపు పదేళ్లపాటు ఆయన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో వారు కూడా కృష్ణయ్యతో చర్చించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్: రికార్డు క్రియేట్ చేసిన హైడ్రా..
రామప్ప ఆలయ పరిసరాలల్లో గుప్తనిధుల కోసం వేట
శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 23 , 2024 | 11:09 AM