పొంగులేటి ఇంట్లో ఈడీ బృందాల సోదాలు..
ABN, Publish Date - Sep 27 , 2024 | 02:04 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటితో పాటు అతని కూతురు ఇంట్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. కొన్ని అనుమానాస్పదమైన లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. సీఆర్పీఎఫ్ భద్రత మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటితో పాటు అతని కూతురు ఇంట్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. కొన్ని అనుమానాస్పదమైన లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోదాల్లో భాగంగా కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిపై పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వాల్మీకి రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
జగన్కు వ్యతిరేకంగా తిరుమలలో నిరసనలు..
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. సీఎం నివాళులు
హైడ్రను అడ్డుకున్న మూసీ నివాసితులు..
కడియపులంక నర్సరీల్లో సంచరిస్తున్న చిరుత
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 27 , 2024 | 02:06 PM