ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ సముద్ర తీరంలో తప్పిన ప్రమాదం..

ABN, Publish Date - Sep 16 , 2024 | 08:41 AM

విశాఖ: సముద్ర తీరంలో పెద్ద ప్రమాదం తప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు ఇంజన్‌లో మంటలు చెలరేగి బోటు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో మరో బోటులో మత్స్య కారులు తీరానికి చేరుకున్నారు.

విశాఖ: సముద్ర తీరంలో పెద్ద ప్రమాదం తప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు ఇంజన్‌లో మంటలు చెలరేగి బోటు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో మరో బోటులో మత్స్య కారులు తీరానికి చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనలో రూ. 40 లక్షల ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.


మత్స్యకారులు వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన ఐఎన్‌డీఏపీవీ 5ఎంఎం 495 నంబరు గల మెకనైజ్డ్‌ బోటులో ఆదివారం ఐదుగురు మత్స్యకారులు హార్బర్‌ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు వేటాడుతుండగా బోటు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాలుల ధాటికి అవి బోటునంతా వ్యాపించడంతో భయాందోళన చెందిన మత్స్యకారులు గురుమూర్తి, నరసింహం, రాము, సత్తయ్య, అప్పన్న సముద్రంలోకి దూకేశారు. అటుగా వస్తున్న మరో బోటు ప్రమాదాన్ని గుర్తించి, సముద్రంలో ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్న మత్స్యకారులను తమ బోటులో ఎక్కించుకుని క్షేమంగా ఫిషింగ్‌ హార్బర్‌కు చేర్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అజ్ఞాతంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు?

విజయ్ చివరి చిత్రం రెమ్యూనరేషన్ ఎంతంటే..

ఏపీలో ఇసుక రవాణా చార్జీలు ఖరారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 16 , 2024 | 08:41 AM

Advertising
Advertising