భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
ABN, Publish Date - Oct 06 , 2024 | 01:41 PM
ముంబై: నగరంలోని చెంబూరు, సిద్ధార్థ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అపార్టుమెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణంలో మంటలు చెలరేగాయి. మంటలు మీటర్ బాక్స్కు అంటుకుని భవనం చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు.
ముంబై: నగరంలోని చెంబూరు, సిద్ధార్థ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అపార్టుమెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణంలో మంటలు చెలరేగాయి. మంటలు మీటర్ బాక్స్కు అంటుకుని భవనం చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
మృతులు మంజూ ప్రేమ్ గుప్తా, అనిత, ప్రేమ్, నరేంద్ర, నరేంద్ర పారిస్ గుప్తాగా గుర్తించారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారు జాము 5 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. G+2 భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ భవనం క్రింద కిరాణా దుకాణం ఉండగా, పై రెండు అంతస్తుల్లో నివాసాలు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్తో మొదట కిరాణా దుకాణంలో మంటలు చెలరేగి.. అనంతరం భవనమంతా వ్యాపించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సాక్షి పాడు బుద్ధి. .ఆధారాలతో బట్టబయలు..
దుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..
బరితెగించిన స్మగ్లర్స్.. పోలీసులపై హత్యాయత్నం
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 06 , 2024 | 01:42 PM