బతుకమ్మ చీరల పంపిణీలో గోల్ మాల్..
ABN, Publish Date - Sep 30 , 2024 | 12:10 PM
గత ఏడాది పంపిణీ చేయకుండా ఉన్న 5 వేల బతుకమ్మ చీరలను సిద్దిపేట జిల్లా, చేర్యాల సాంఘిక సంక్షేమ బాలుర హాస్టళ్లలో ఓ గదిలో భద్రపరిచారు. వేల సంఖ్యలో చీరలు పంపిణీ చేయకుండా నిలువ చేసిన కారణంగా లక్షల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది.
హైదరాబాద్: తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీలో గోల్ మాల్ జరిగింది. దసరా పండుగకు ఇవ్వాల్సిన చీరలు పంపిణీ చేయకుండానే రిజిస్ట్రార్లో నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ చీరలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసింది. ఈ పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసింది. అయితే గత ఏడాది పంపిణీ చేయకుండా ఉన్న 5 వేల బతుకమ్మ చీరలను సిద్దిపేట జిల్లా, చేర్యాల సాంఘిక సంక్షేమ బాలుర హాస్టళ్లలో ఓ గదిలో భద్రపరిచారు. వేల సంఖ్యలో చీరలు పంపిణీ చేయకుండా నిలువ చేసిన కారణంగా లక్షల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాల మున్సిపాలిటికి సుమారు 20 వేలకు పైగా చీరలను పంపిస్తే అందులో 5 వేలకుపైగా చీరలు మిగిలినప్పటికీ అధికారులు మాత్రం చీరలు పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్లు రాసుకున్నారు. ఒక్క చేర్యాలలోనే అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు వృధా అయ్యాయన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎంపీ ఆనంకు ఎందుకు భయపడుతున్నారు..
తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ..
హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్..
రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ
బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ నేడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 30 , 2024 | 12:10 PM