వసూళ్ళ కోసమే హైడ్రా: కేటీఆర్
ABN, Publish Date - Oct 16 , 2024 | 01:59 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రాపై హాట్ కామెంట్స్ చేశారు. వసూళ్ళ కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిందని ఆరోపించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రాపై హాట్ కామెంట్స్ చేశారు. వసూళ్ళ కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిందని ఆరోపించారు. హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి ప్రభుత్వం వసూళ్ళకు పాల్పడుతోందన్నారు. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారన్నారు. అఖిలపక్షం సమావేశం కాదు.. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో మీటింగ్ పెట్టాలన్నారు. పార్టీల అభిప్రాయాలు కాకుండా.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో ఉన్నారా.. లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా.. అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణమైతే.. తన ఫాంహౌస్ను కొట్టేయొచ్చని అన్నారు. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ చేసుకోవచ్చునని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మామ జగన్ మోహన్ రెడ్డికి అఖిల ప్రియ సవాల్
స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జాయ్ జమీమా దారుణాలపై నోరు విప్పిన బాధితులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 16 , 2024 | 01:59 PM