ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అబద్ధాలతో పుట్టి.. ఫేక్‌తో పెరిగి..

ABN, Publish Date - Sep 12 , 2024 | 09:01 AM

గుంటూరు: జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను పరామర్శించిన జగన్ తర్వాత కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లిన జగన్ తమ పార్టీకి చెందిన వారిని వేటాడుతున్నారని.. ఈ కొద్ది రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని ఢిల్లీలో ఆరోపించారు.

గుంటూరు: జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను పరామర్శించిన జగన్ తర్వాత కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లిన జగన్ తమ పార్టీకి చెందిన వారిని వేటాడుతున్నారని.. ఈ కొద్ది రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని ఢిల్లీలో ఆరోపించారు. జగన్ నిజాయితీ పరుడైతే ఆయన చెబుతున్న 36 మంది పేర్లు, చిరునామాలు ఇవ్వాలని ప్రభుత్వ పక్షం డిమాండ్ చేసింది. అయినా సరే జగన్ స్పందించలేదు.


సరిగ్గా అదే పద్ధతిలో మరోసారి జగన్ విమర్శలు చేశారు. విజయవాడ వరదల్లో 60 మంది మరణించారని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కూడా టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నలు వేశారు. జగన్ చెప్పింది నిజమే అయితే 60 మంది పేర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ అబద్ధంతో జన్మించారని, ఫేక్‌తో పెరిగారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జనం కష్టాల్లో ఉంటే వారిని పట్టించుకోకుండా జైలుకు వెళ్లి ఒక క్రిమినల్‌ను పరామర్శించారని మంత్రి ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆరు లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకోడానికి జగన్ చేసిన పాపాలే కారణమని మంత్రి అనగాని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక

ఏపీలో కొత్త మద్యం పాలసీ..

కాకినాడ వరద బాధితులకు చంద్రబాబు భరోసా

పసిడి ప్రియులకు షాక్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 12 , 2024 | 09:02 AM

Advertising
Advertising