కర్నాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు..
ABN, Publish Date - Sep 26 , 2024 | 01:58 PM
బెంగళూరు: కర్నాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముడా స్కాంలో సీఎం సిద్ధ రామయ్యపై వస్తున్న ఆరోపణలకు నిరసనగా బీజేపీ ఆందోళన కొనసాగిస్తోంది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద బీజేపీ, జేడీఎస్ నిరసన కార్యక్రమం చేపట్టాయి.
బెంగళూరు: కర్నాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముడా స్కాంలో సీఎం సిద్ధ రామయ్యపై వస్తున్న ఆరోపణలకు నిరసనగా బీజేపీ ఆందోళన కొనసాగిస్తోంది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద బీజేపీ, జేడీఎస్ నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేడీఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసును సీబీఐకు అప్పగించాలని, ఆయన సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విధాన సౌథ నుంచి భారీ ర్యాలీగా వెళుతున్న బీజేపీ, జేడీఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా కొద్ది రోజులుగా కర్నాటక రాజకీయాలను ముడా స్కాం వ్యవహారం కుదిపేస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధ రామయ్యను ప్రాసిక్యూషన్ చేయడానికి గవర్నర్ అనుమతించడం.. దీనిని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేయడం.. న్యాయమూర్తి పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. ఈ క్రమంలోనే బెంగళూరు ప్రత్యేక కోర్టు నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఉత్తర్వులో ఆదేశించింది. ముడా భూముల కేటాయింపులపై కర్నాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్ర వర్సిటీలో డీజీ లాకర్ సిస్టమ్..
జానీ మాస్టర్ విచారణ.. వెలుగులోకి సంచలన నిజాలు..
హైదరాబాద్ వాసులకు సర్కార్ తీపి కబురు
సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి లోకేష్
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుకొండ సైనిక్ స్కూల్కు వెంకయ్యనాయుడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 26 , 2024 | 01:58 PM