ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్పులతో కొత్త న్యాయదేవత విగ్రహం

ABN, Publish Date - Oct 17 , 2024 | 01:42 PM

సుప్రీంకోర్టులో కొన్ని మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్‌ జస్టిస్‌) విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశా న్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్‌ను తొలగించడంతో పాటు అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని కొత్త విగ్రహంలో చేర్చారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కొన్ని మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్‌ జస్టిస్‌) విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్‌ను తొలగించడంతో పాటు అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని కొత్త విగ్రహంలో చేర్చారు. న్యాయదేవత మరో చేతిలా కనిపించే త్రాసును అలాగే ఉంచారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఈ కొత్త విగ్రహం కనిపించింది.


ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. బ్రిటిష్‌ వలసవాద చట్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయ దేవత విగ్రహంలోనూ మార్పులు చేయాలని గతంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. ‘న్యాయదేవత కళ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు. అది అందరినీ సమానంగా చూస్తుంది. కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తోంది. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

సజ్జలను విచారించనున్న పోలీసులు ..

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 17 , 2024 | 01:42 PM