పల్నాడులో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
ABN, Publish Date - Sep 20 , 2024 | 01:59 PM
పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, మూగచింతలపాలెంలో వైసీపీ శ్రేణలు రెచ్చిపోయారు. తెలుగుయువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ ఇంటిముందున్న కారును ప్రత్యర్థులు వైసీపీ శ్రేణలు తగులబెట్టారు.
పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, మూగచింతలపాలెంలో వైసీపీ శ్రేణలు రెచ్చిపోయారు. తెలుగుయువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ ఇంటిముందున్న కారును ప్రత్యర్థులు వైసీపీ శ్రేణలు తగులబెట్టారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను అదుపులోకి తెచ్చారు. కారు ప్రక్కనే పెట్రోలు తీసుకువచ్చిన డబ్బాను పడేసి దుండగులు పారిపోయారు. ఆ డబ్బా ఆధారంగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఉన్న పెట్రోల్ బంకువద్ద సీసీ పుటేజ్ను పరిశీలించారు. అందులో పెట్రోల్ కొట్టించిన దుండగులను గుర్తించిన పోలీసులు వారి కోసం దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన.. (ఫోటో గ్యాలరీ)
ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ (ఫోటో గ్యాలరీ)
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 20 , 2024 | 01:59 PM