ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జనసేనలోకి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య..!

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:26 PM

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రపై విజయం సాధించారు.

గుంటూరు: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రపై విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొన్నూరు టికెట్‌ను ఆయనకు కేటాయించలేదు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. రోశయ్య ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీచేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో రోశయ్య పార్టీలోనే ఉన్నా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి సానుకూలంగా రాకపోవడంతో వైసీపీకి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేనలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 02:29 PM