అందరి దృష్టిని ఆకర్షించిన నారా లోకేష్
ABN, Publish Date - Sep 24 , 2024 | 08:24 AM
అమరావతి: మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. యువగళం పాదయాత్ర తర్వాత ఇటీవల జిల్లాకు వచ్చినందుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సమయంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
అమరావతి: మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. యువగళం పాదయాత్ర తర్వాత ఇటీవల జిల్లాకు వచ్చినందుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సమయంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. వైసీపీ అధికారంలో ఉండగా పాదయాత్ర చేసిన సమయంలో లోకేష్ నుంచి మైక్ లాక్కోవడం, స్టూల్ తీసేయడం వంటి ఘటనలకు పాల్పడిన పోలీసులే ఇప్పుడు సెల్యూట్ చేశారు. వైసీపీకి అధికారాన్ని దూరం చేయడంలో లోకేష్ పాదయాత్ర కూడా దోహదం చేసింది. అప్పట్లో జరిగిన అన్నీ ఘటనలను నారా లోకేష్ గుర్తు చేసుకుని వాటికి సమాధానం చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
2023 జనవరి 27న ప్రారంభించిన లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. ఫిబ్రవరి 3న యాత్ర పూతలపట్టు అసెంబ్లీ స్థానం, బంగారుపాళ్యం ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి వైసీపీ తట్టుకోలేకపోయింది. పోలీసులను ఉసిగొల్పీ మైక్, స్టూల్ లాగేసుకుని, వాహనాలను సీజ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేడర్కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..
టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్రెడ్డిపై కేసు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 24 , 2024 | 08:24 AM