National Archery Committee: ఆర్చరీ కమిటీ సభ్యుడిగా శంకరయ్య
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:22 AM
జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీకి మహబూబాబాద్ జిల్లా కు చెందిన పుట్టా శంకరయ్య సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా మహబూబాబాద్కు చెందిన పుట్టా శంకరయ్య నియమితులయ్యారు.ఈ కమిటీలో మొత్తం ఎనిమిది మందికి చోటు కల్పించారు. చైర్మన్గా విజయవాడకు చెందిన చెరుకూరి సత్యనారాయణ, కన్వీనర్గా సుమంత చంద్ర మొహంతి, జమ్యాంగ్ సెరింగ్, దేవానంద సింగ్, అలాగే సంజీవ్ సింగ్, పూర్ణిమ, జీవన్జ్యోత్ సింగ్ (ఈ ముగ్గురూ ద్రోణాచార్య అవార్డీలు)కు కమిటీలో చోటు లభించింది.