మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2022-11-05T23:48:43+05:30 IST

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు జనవరి నుంచి అమలు చేస్తున్న హెల్త్‌ అలవెన్సును తిరిగి జీతాలనుండి నుంచి రికవరీ చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్మికుల ధర్నా
ప్రొద్దుటూరులో ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

ప్రొద్దుటూరు అర్బన్‌, నవంబరు 5 : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు జనవరి నుంచి అమలు చేస్తున్న హెల్త్‌ అలవెన్సును తిరిగి జీతాలనుండి నుంచి రికవరీ చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.శనివారం సీఐటీయూ అనుబంధ మున్సిపల్‌ వర్క్‌ర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ అఽధ్యక్షుడు చంటి,కోశాధికారి రాఘవ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణమ్మ , ఉపాధ్యక్షులు గుర్రమ్మ రమాదేవి,లక్ష్మీదేవి, శాంతి ,కార్యదర్శులు మోహన్‌ ,రవికుమార్‌, జాకోబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T23:49:03+05:30 IST