నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ABN , First Publish Date - 2022-10-31T22:47:14+05:30 IST
ఆసిఫాబాద్, అక్టోబరు 31: సీసీరోడ్లు, మురికి కాలువల నిర్మాణపనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వినాయకనగర్, ఎన్జీవో కాల నీల్లో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను ఆయన పరిశీలించారు.

ఆసిఫాబాద్, అక్టోబరు 31: సీసీరోడ్లు, మురికి కాలువల నిర్మాణపనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వినాయకనగర్, ఎన్జీవో కాల నీల్లో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ జిల్లా కేంద్రంలో డ్రెయిన్లు, రోడ్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించా మన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో ఎక్కడ కూడా మట్టిరోడ్లు లేకుండా చేస్తామన్నారు. నాయకులు వెంకన్న, సాలం, తదితరులు ఉన్నారు.
ఆదివాసీ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత యువతదే
ఆదివాసుల సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత యువతదేనని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. సోమ వారం మండలంలోని వట్టివాగు కాలనీలో దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆమట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం దండారీఉత్సవాలను గుర్తించి దండారి గ్రామాలకు పదివేల చెక్కులను అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి క్షేత్రయ్య, జీసీడీవో శకుంతల, ఎస్పీఆర్సీ రవీందర్, సర్పంచ్ దినకర్, ఎంపీటీసీ శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.