ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapuram Dist.: వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బందికి ఊహించని షాక్‌లు

ABN, First Publish Date - 2023-04-19T17:28:07+05:30

అనంతపురం జిల్లా: ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమంలో వైసీపీ నేతలు (YCP Leaders), సచివాలయ సిబ్బంది (Secretariat Staff)కి ఊహించని షాకులు తగులుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమంలో వైసీపీ నేతలు (YCP Leaders), సచివాలయ సిబ్బంది (Secretariat Staff)కి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇంటింటికి జగన్ స్టిక్కర్లు (Jagan Stickers) అంటించిన వాళ్లకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘మా కోసం ఏం చేశారని స్టిక్కర్లు అంటిస్తున్నారంటూ’ ప్రజలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఉరవకొండలో దాసరి రవి, లక్ష్మి అనే దంపతులు స్టిక్కర్లపై సచివాలయ సిబ్బందిని నిలదీసిన ఘటన సంచలనమైంది.

వివరాల్లోకి వెళితే.. శివరామరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న దాసరి రవి, లక్ష్మి దంపతుల ఇంటికి సచివాలయ సిబ్బంది జగన్ స్టిక్కర్ అంటించారు. దీనిపై ఆ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని అలాంటప్పుడు తమ ఇంటికి జగన్ స్టిక్కర్ ఎలా అంటిస్తారంటూ ఆ స్టిక్కర్‌ను పీకేశారు. సగం చిరిగిపోయిన జగన్ స్టిక్కర్‌ను పట్టుకుని సచివాలయానికి వచ్చి ఉద్యోగులను నిలదీశారు. జగనన్న స్టిక్కర్ వద్దూ.. మీ భరోసా వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయం కూడా పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. దీంతో సచివాలయ సిబ్బంది షాక్ అయ్యారు. చివరికి మీకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామంటూ వారిని శాంతించే ప్రయత్నం చేశారు. కాగా ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురవుతుండడంతో వైసీపీ నేతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - 2023-04-19T17:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising