ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari: హవ్వ.. ఇదేం పని జగన్.. ట్విటర్‌లో పరువు తీసేసిన పురందేశ్వరి !

ABN, First Publish Date - 2023-08-26T12:42:10+05:30

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల నూతన మండలి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు నూతన సభ్యుల నియామకంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పెదవి విరిచారు. టీటీడీ బోర్డును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆమె ట్వీట్ చేశారు.

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల నూతన మండలి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు నూతన సభ్యుల నియామకంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పెదవి విరిచారు. టీటీడీ బోర్డును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆమె ట్వీట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పాత్రధారుడుగా ఉంటే, కేతన్ దేశాయ్ ఎంసీఐ స్కామ్‌లో దోషిగా నిలిచిన వ్యక్తి అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. కేతన్ దేశాయ్‌ను ఢిల్లీ హైకోర్టు ఎంసీఐ నుంచి తొలగించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తిరుమల తిరుపతి పవిత్రతను మసకబార్చే ఈ నియామకాలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తోందని ట్విటర్‌లో పురందేశ్వరి స్పష్టం చేశారు. మొత్తం 24 మంది సభ్యుల్లో ఏడుగురికి టీటీడీ బోర్డులో మళ్లీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి ఈనెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 15 రోజులకు పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. అందరూ ఊహించినట్లుగానే... తనకు ఎన్నాళ్లుగానో వివిధ కోణాల్లో ఉపయోగపడుతున్న, ఉపయోగపడతారని భావించే వాళ్లకే పెద్దపీట వేశారు.


రాజకీయ ప్రాబల్యం ఉన్నవారి సిఫారసులకు, న్యాయవాదులకు అవకాశం కల్పించారు. ‘ఎవరేమనుకుంటే నాకేం’ అన్నట్లుగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితుడు, తర్వాత అప్రూవర్‌గా మారిన పెనక శరత్‌చంద్రా రెడ్డికి టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. ఆయన.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి సోదరుడు కావడం గమనార్హం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌కు చెందిన వారికి బోర్డులో చోటు కల్పించారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి నలుగురికి ఈ జాబితాలో చోటు దక్కింది. బీజేపీకి చెందిన డాక్టర్‌ శంకర్‌కు బోర్డులో స్థానం కల్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈయన సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. వైసీపీ వచ్చాక ఇతనికి వరుసగా రెండోసారి అవకాశం దక్కింది అలాగే... హైకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి వైద్యనాథన్‌కు చోటు కల్పించారు. న్యాయ వర్గాల్లో ఆయనకు మంచి పట్టుందని సమాచారం. అంతేకాదు... కృష్ణమూర్తి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సన్నిహితుడు. ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవి దక్కడం ఇది వరుసగా నాలుగోసారి.

‘టీసీఎస్‌’ వేణు కుమారుడు సుదర్శన్‌ వేణుకు కూడా పదవి లభించింది. ఇక.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు బాగా సన్నిహితుడైన బాలసుబ్రమణియన్‌ పళనిస్వామికి కూడా టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. మహారాష్ట్రలో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే కార్యదర్శి మిలింద్‌ నర్వేకర్‌ను కూడా టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. ఆయనకుఈ పదవి కల్పించడం ఇది రెండోసారి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌ బోరాకూ మరోసారి స్థానం కల్పించారు. ఇదే రాష్ట్రానికి చెందిన అమోల్‌కాలే గతంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండగా, ఈసారి బోర్డులో సభ్యత్వం కల్పించారు. అలాగే.. గుజరాత్‌కు చెందిన డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌కి కూడా మరోసారి బోర్డులో చోటు కల్పించారు. ఆయన.. యూరాలజిస్ట్‌. 2001లో అప్పటి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పదవి కోల్పోయారు. కర్ణాటక నుంచి వీఆర్‌ దేశ్‌పాండేకు బోర్డులో స్థానం కల్పించారు. తెలంగాణ నుంచి చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి సతీమణి సీతా రెడ్డికి బోర్డు సభ్యురాలిగా స్థానం కల్పించారు.

Updated Date - 2023-08-26T12:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising