Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీగా పోలీసుల మోహరింపు

ABN, First Publish Date - 2023-01-04T12:23:16+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పోలీసులు అడుగడుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు.

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీగా పోలీసుల మోహరింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) కుప్పం పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతిపురం మండలానికి పోలీసులను తరలించారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ టీడీపీ నేతలు ఇప్పటికే లేఖ ఇచ్చారు. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజ్‌ను కూడా పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటించే తొలి గ్రామంతో సహా మండలంలో అన్ని చోట్ల భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి గ్రామంలో, కూడళ్ళలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలు చేరుకున్నాయి. మరో రెండు గంటల్లో చంద్రబాబు నాయుడు బెంగుళూరు నుంచి 121 - పెద్దూరు గ్రామాన్ని చేరుకోనున్నారు.

Updated Date - 2023-01-04T12:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising