ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం.. చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ

ABN, First Publish Date - 2023-08-05T14:17:40+05:30

శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇంకోవైపు అడుగడుగునా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కొన్నింటిని తొలగించారు. మరికొన్ని ఫ్లెక్సీల్లో సైకో పోవాలి అనే పదానికి అధికారులు రంగులు వేశారు.

తిరుపతి: శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శ్రీకాళహస్తిలో రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇంకోవైపు అడుగడుగునా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ (TDP) ఫ్లెక్సీలు కొన్నింటిని తొలగించారు. మరికొన్ని ఫ్లెక్సీల్లో సైకో పోవాలి అనే పదానికి అధికారులు రంగులు వేశారు. బహిరంగ సభ జరిగే బేరివారి మండపం దగ్గర టీడీపీ శ్రేణులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు ఎదురుగా నాలుగు గంటలపాటు టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. సైకోపోవాలి... సైకిల్ రావాలి... అనే పాట పెడితే సౌండ్ బాక్సులు బద్దలు కొడతామంటూ వైసీపీ శ్రేణులు హెచ్చరికలు చేశారు. వైసీపీకి అనుకూలంగా సీఐ అంజూ యాదవ్ ఉన్నారు. అంతేకాకుండా బహిరంగ సభకి లేనిపోని ఆంక్షలు విధించారు‌.

శుక్రవారం అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు ఉద్రిక్తతలు సృష్టించారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురి గాయపడ్డారు.

Updated Date - 2023-08-05T14:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising