ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leaders: ‘వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతోంది ’

ABN, First Publish Date - 2023-05-07T08:58:37+05:30

గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana), మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ (Former MLA Sridhar) విమర్శలు గుప్పించారు. ఈరోజు ఉదయం పెదకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటను నేతలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... అకాల వర్షాలకు పంటల పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు భరోసా కల్పించే పరిస్థితులో లేదని తెలిపారు. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో నష్ట పరిశీలన చేయలేదని.. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని అన్నారు. మొక్కజొన్న, మిర్చి రైతులు అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం రైతులకు అవసరమైన టార్పాలిన్ పట్టలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వానికి ఇంతవరకు ఉలుకు పలుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన మిర్చి పంటకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని.. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని కన్నా లక్ష్మీనారాయణ, శ్రీధర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-07T09:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising