ఘనంగా గంగజాతర వేడుకలు

ABN , First Publish Date - 2023-04-16T23:42:26+05:30 IST

మండల పరిధిలోని ఏకోపల్లె గ్రామంలో ఆదివారం ఘనంగా గంగమ్మ, అంకాలమ్మ జాతర మ హోత్సవాలు నిర్వహించారు.

ఘనంగా గంగజాతర వేడుకలు
గంగమ్మ దేవాలయంలో పూజలు చేస్తున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌

దువ్వూరు, ఏప్రిల్‌ 16: మండల పరిధిలోని ఏకోపల్లె గ్రామంలో ఆదివారం ఘనంగా గంగమ్మ, అంకాలమ్మ జాతర మ హోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అ మ్మవారికి గ్రా మంలో పెద్ద ఎత్తున బోనాలు, చల్ల ఏర్పాటు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి అన్నదానం నిర్వహించారు. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ జాతర వేడుకల్లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల టీడీపీ కన్వీనర్‌ బోరెడ్డి వెంకటరమణారెడ్డి, పంగా చిన్న సుబ్బరాయుడు, పంగా సుబ్బరాయుడు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-16T23:42:40+05:30 IST