ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆందోళనలకు పిలుపు

ABN, First Publish Date - 2023-11-21T16:00:42+05:30

కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రభుత్వం మంగళవారం చిల్లర విధిల్చింది. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లు జమ చేసింది.

అమరావతి: బకాయిల కోసం ఆందోళన బాట పట్టాలని కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. తమ బకాయిలు చెల్లించాలని బుధవారం విజయవాడలో (Vijayawada) కంటాక్టర్లు ఆందోళన చేపట్టనున్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( BAI) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టనున్నారు.

రూ.100 కోట్ల జమ..

కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రభుత్వం మంగళవారం చిల్లర విధిల్చింది. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లు జమ చేసింది. ఇటువంటి వాటికి తాము లొంగేది లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. BAI ఆందోళనకు మద్దతు ఇచ్చి తాము కూడా ధర్నాలో పాల్గొంటామని SABCA సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు విజయవాడకు బయలుదేరారు. తమ బకాయిలు కోసం ధర్నా చేసి తీరుతామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తమకు పూర్తిగా బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన ఆగదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఆగేది లేదని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2023-11-21T16:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising