ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Brahmani: నారా బ్రాహ్మణి పిలుపునకు అనూహ్య స్పందన.. ఉదయం నుంచే..

ABN, First Publish Date - 2023-09-30T14:06:10+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను (Chandrababu Arrest) నిరసిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmani) ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రాహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈరోజు (శనివారం) ఉదయం మోత మోగిస్తూ... నిరసన కార్యక్రమానికి విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. మోత మోగిద్దాం కార్యక్రమానికి సంఘీభావంగా ముందుగానే నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లేట్లు, స్పూన్లు, కంచాలు, గరిటెలతో శబ్దాలు చేస్తూ.... ఈలలు వేస్తూ నారా బ్రహ్మణికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల నిరసన కార్యక్రమానికి ప్రజలు రెడీ అవుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వారికి గట్టిగా వినబడేలా మోత మోగిస్తామని విశాఖ వాసులు చెబుతున్నారు.


మోత మోగిద్దామన్న బ్రహ్మణి...

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ మోత మోగిద్దాం పేరిట నిరసన కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదన్నారు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అని అన్నారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని పిలుపునిచ్చారు. ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయాలని కోరారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలన్నారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.


అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా ‘‘మోతమోగిద్దాం’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు పెడితే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. చంద్రబాబుకు తెలుగువారంతా మద్దతిస్తున్నారని నిరూపించే సమయమిది. శనివారం రాత్రి ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-09-30T14:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising