MLA Kotam Reddy.. మూడు సార్లు సీఎం జగన్ సంతకాలు చేసి..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-05-08T14:07:34+05:30

నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) ఆధ్వర్యంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై పోరాటం ప్రారంభమైంది.

MLA Kotam Reddy.. మూడు సార్లు సీఎం జగన్ సంతకాలు చేసి..: ఎమ్మెల్యే కోటంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) ఆధ్వర్యంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై పోరాటం ప్రారంభమైంది. రూరల్ కార్యాలయంలో క్రైస్తవ మత పెద్దలు, పలు చర్చిల ఫాదర్లతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేంత వరకు పోరాటం చేయాలని‌ నిర్ణయించారు. ముందుగా మంత్రి కాకాణి, అధికారులకు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టింగులు, పోస్టుకార్డులు పంపిస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు అడుగుతున్న సమస్య కాదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అయినప్పటి నుంచి చెబుతున్నానని.. మూడు సార్లు సీఎం జగన్ (CM Jagan) సంతకాలు చేసి.. ఇంపార్టెంట్ అని కోడ్ చేశారని.. అయినా నిధులు‌ విడుదల కాలేదన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి అయితే.. ఎంతో మంది క్రిస్టియన్లకు ఉపయోగమని ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-08T14:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising