ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP HighCourt: కిలారు రాజేష్ విషయంలో పొరపాటు జరిగిందన్న సీఐడీ

ABN, First Publish Date - 2023-11-10T16:14:01+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ (TDP Leader Kilaru Rajesh) వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టులో (AP High court) విచారణ జరిగింది. 161, 91 సెక్షన్‌ల కింద నోటీసులు ఇవ్వడాన్ని కిలారు రాజేష్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈరోజు(శుక్రవారం) హైకోర్టులో విచారణకు రాగా.. రాజేష్ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. ఎల్‌ఓసీ నోటీసుల్లో రాజేష్‌ను నిందితుడిగా చూపించిన విషయాన్ని ఆదినారాయణరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ 161, 91 కింద నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ వాదనలు వినిపించారు. తాము ఎల్‌ఓసీ పొరపాటున ఇచ్చామని సీఐడీ తరపు న్యాయవాది చెప్పారు. హైదరాబాద్‌లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాజేష్‌ను వెంబడించిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకువచ్చారు. అయితే తాము రాజేష్‌ను నిందితుడిగా పేర్కొనలేదని సీఐడీ న్యాయవాది చెప్పారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టుల ఈనెల 17కు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-10T16:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising