ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP MLA: ‘బుక్‌ మై ఎమ్మెల్యే’ అంటూ వాసుపల్లి గణేష్‌పై పోస్టర్స్.. తీవ్ర కలకలం

ABN, First Publish Date - 2023-10-28T11:06:03+05:30

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌పై మరోసారి పోస్టర్స్ వెలిశాయి. పోస్ట్‌లు అమ్ముకుంటున్నారని దక్షిణ నియోజకవర్గం వ్యాప్తంగా గతరాత్రి పోస్టర్లు వేయండంతో తీవ్ర కలకలం రేగింది. బుక్ మై ఎమ్మెల్యే అంటూ టిడ్కో ఇళ్ళు, దేవాలయాలు ఛైర్మన్‌ల పోస్ట్‌లు, పార్టీ పెదవులు అమ్మబడును అని అర్ధం వచ్చేటట్లు పోస్టర్లు వెలిశాయి.

విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌పై (MLA Vasupalli Ganesh Kumar) మరోసారి పోస్టర్స్ వెలిశాయి. పోస్ట్‌లు అమ్ముకుంటున్నారని దక్షిణ నియోజకవర్గం వ్యాప్తంగా గతరాత్రి పోస్టర్లు వేయండంతో తీవ్ర కలకలం రేగింది. బుక్ మై ఎమ్మెల్యే అంటూ టిడ్కో ఇళ్ళు, దేవాలయాలు ఛైర్మన్‌ల పోస్ట్‌లు, పార్టీ పదవులు అమ్మబడును అని అర్ధం వచ్చేటట్లు పోస్టర్లు వెలిశాయి. డీలర్స్ ఎవేలబుల్ 40 శాతం కమీషన్ అంటూ పోస్టర్లలో రాతలు ఉన్నాయి. అయితే వీటిని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు ఈరోజు (శనివారం) తెల్లవారుజామును పోస్టర్లను తొలగించారు. అయితే ఈ వ్యహారంపై అటు ఎమ్మెల్యే గానీ, ఆయన అనుచరులు గానీ ఇంకా స్పందించలేదు. గతంలో కూడా ఇదేవిధంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌పై పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. టీడీపీలో గెలిచిన గణేష్‌ కుమార్‌ ఆ తరువాత వైసీపీ కండువా కప్పుకున్నారు. చాలా కాలంగా వాసుపల్లి గణేష్‌తో వైసీపీలోని మరో వర్గం విభేదిస్తూ వస్తోంది. మరి ఈ పోస్టర్ల వెనుక ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-28T11:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising