ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:16 AM

ఓ ద్విచక్ర వాహనాన్ని ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్రీ సత్యసాయి జిల్లా: ఓ ద్విచక్ర వాహనాన్ని ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ కింద తండాకు చెందిన బాబు నాయక్, షకీలా నాయక్ ద్విచక్ర వాహనంపై కదిరికి వెళ్తుండగా ఎమ్మెల్యే ఎస్కార్ట్ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబు నాయక్, షకీలా నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising